ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన తరఫున పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాలను చంద్రబాబు, పవన్కల్యాణ్లు శనివారం విడుదల చేశారు.
తెలుగు దేశం పార్టీ 94 స్థానాలకు తన అభ్యర్థులను ప్రకటించింది.
జనసేన 24 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీచేయనున్నట్టు ఆ పార్టీ అధినేత పవన్కల్యాణ్ ప్రకటించారు. జనసేన 5 స్థానాల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.
AP Elections 2024 కోసం భవిష్యత్తులో బీజేపీతో పొత్తు కుదిరితే ఆ పార్టీకీ కొన్ని స్థానాలను కేటాయించనున్నట్టు ప్రకటించారు.
ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని పార్టీల మధ్య సీట్ల ఒప్పందం కుదిరినట్టు పవన్ కల్యాణ్ తెలిపారు.
జనసేన తరపున ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి బరిలో దిగనున్నారు. 19 స్థానాలకు జనసేన అభ్యర్థులను తర్వాత జాబితాలో ప్రకటించనుంది.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సీనియర్ నేత యనమల రామకృష్ణుడు. జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, నాగబాబు తదితరులు పాల్గొన్నారు.